Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పి 'సమ్మోహన' పరిచిన అదితి రావు

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు భామల కంటే పరాయి రాష్ట్రాల భామలే అధికంగా ఉన్నారు. వీరిలో కాజల్, తమన్నా వంటి వారు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉంటున్నా ఎన్నడూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న పాపానపోలేదు.

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (16:47 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు భామల కంటే పరాయి రాష్ట్రాల భామలే అధికంగా ఉన్నారు. వీరిలో కాజల్, తమన్నా వంటి వారు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉంటున్నా ఎన్నడూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న పాపానపోలేదు.
 
కానీ, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌, కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్‌, షాలిని పాండే త‌దిత‌రులు రీసెంట్ చిత్రాల‌లో వారి పాత్ర‌ల‌కి వారే డ‌బ్బింగ్ చెప్పుకుని ఇతర హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 
 
తాజాగా వీరి సరసన అదితి రావు కూడా చేరిపోయారు. డైరెక్టర్ ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న "స‌మ్మోహ‌నం" సినిమా కోసం అదితి రావు హైద‌రి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ముద్దుగా ముద్దుగా తెలుగు మాట్లాడుతూ అల‌రిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. 
 
సుధీర్ బాబు.. అదితి రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల‌ 10న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా మ‌హేష్ బాబు హాజ‌రు కానున్నారు. 'చెలియా' అనే డ‌బ్బింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి పరిచయమైన అదితి రావు హైద‌రి ఇపుడు "స‌మ్మోహ‌నం" చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments