Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు గారు -సుమన్

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (14:40 IST)
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కోట్లాది మంది ప్రార్థనలు చేసినప్పటికీ ఈ ప్రార్థనలు ఏమీ ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. బాలు ఇక లేరు అనే వార్తను ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకి తెలియచేసారు. 
 
బాలు లేకపోవడం అనేది సంగీత ప్రపంచానికి తీరనిలోటు. బాలు లేరు అని తెలిసినప్పటి నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ.. అనే కాకుండా భారతదేశంలోని సినీ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని తెలియచేసారు.
 
ప్రముఖ సీనియర్ హీరో సుమన్ బాలు గురించి స్పందిస్తూ... నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నా కెరీర్‌ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలు గారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలు గారు నాకు పాడారు. అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పారు.
 
అలాగే శ్రీ రామదాసులోని రామునిగా నటించిన నాకు డబ్బింగ్‌ చెప్పారు. బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments