Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు గారు -సుమన్

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (14:40 IST)
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కోట్లాది మంది ప్రార్థనలు చేసినప్పటికీ ఈ ప్రార్థనలు ఏమీ ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. బాలు ఇక లేరు అనే వార్తను ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకి తెలియచేసారు. 
 
బాలు లేకపోవడం అనేది సంగీత ప్రపంచానికి తీరనిలోటు. బాలు లేరు అని తెలిసినప్పటి నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ.. అనే కాకుండా భారతదేశంలోని సినీ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని తెలియచేసారు.
 
ప్రముఖ సీనియర్ హీరో సుమన్ బాలు గురించి స్పందిస్తూ... నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్‌ కూడా చెప్పారు. నా కెరీర్‌ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలు గారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలు గారు నాకు పాడారు. అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్‌ చెప్పారు.
 
అలాగే శ్రీ రామదాసులోని రామునిగా నటించిన నాకు డబ్బింగ్‌ చెప్పారు. బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments