యాత్ర సినిమా డైరెక్టర్‌ను ఇంటికి పిలిచిన వై.ఎస్.జగన్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:49 IST)
యాత్ర హిట్ టాక్‌తో ఆ సినిమాను ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు వైసిపి నేతలు. ప్రేక్షకుల కన్నా వైసిపి నేతలే షోల వారీగా టిక్కెట్లను బుక్ చేసేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వైసిపిలోకి వచ్చిన నేతలు వైఎస్ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
 
ఎన్నికల ముందు వచ్చిన యాత్ర సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వైసిపి నేతలు, కార్యకర్తలు పుల్ జోష్‌లో ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానుల కోసం సోమవారం వరకు ఈ సినిమాను కొన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శితం చేస్తున్నారు. సినిమా విడుదలకు వారంరోజుల ముందే జగన్ ఈ సినిమాను చూశారట.
 
దర్శకుడు మహీ రాఘవ తీసిన సినిమా అద్భుతంగా ఉందంటూ వైసిపి నేతలు కితాబిస్తున్నారు. నిజ జీవితంలో వైఎస్ఆర్ జీవిత చరిత్రతో పాటు ఆయన పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సినిమాలో చూపించారు. దీంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు ప్రేక్షకులు వేలాదిగా చూస్తుండటంతో వైసిపికి ఇది బాగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. 
 
సినిమాకే ఇంత ప్రయారిటీ ప్రజలు ఇచ్చారంటే వైసిపి పార్టీకి ఇంకెంత నమ్మకం పెడతారో మాటల్లో చెప్పలేమంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారట వైసిపి నేతలు. సినిమా చూసిన జగన్ కూడా ఆ సినిమాలోని ఏ ఒక్క సన్నివేశాన్ని తప్పుపట్టలేదట. సినిమా చాలా బాగుందంటూ దర్శకుడు మహీరాఘవను పిలిచి మెచ్చుకున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments