Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" తర్వాత ఆ హీరోతోనే మూవీ చేస్తా : రాజమౌళి (video)

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:22 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లు హీరోలుగా కాగా, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, బ్రిటన్ నటి ఓలీవియా మోరిస్సాలు హీరోయిన్లు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా ప్లస్ లాక్‌డౌన్ కారణంగా షూటింగును నిలిపేశారు. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులోని భావాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఆర్ఆర్ఆర్ తర్వాత చేసే మూవీలో ఎవరు ఉంటారన్న దానిపై సూచన ప్రాయంగా క్లారిటీ ఇచ్చారు. 
 
'డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా, కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలోనే చేస్తున్నాను. ఆ తరdవాత సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో వుంటుంది. ఆ సినిమా ప్రభాస్‌తో కాదు. మహేశ్ బాబుతో ఉంటుంది. 
 
కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నాను. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది" అని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. వాస్తవానికి ప్రభాస్‌తో రాజమౌళి మూడు చిత్రాలు తీశారు. ఇందులో ఒకటి 'ఛత్రపతి' కాగా, మిగిలిన రెండు చిత్రాలు 'బాహుబలి - ది బిగినింగ్', 'బాహుబలి - ది కంక్లూషన్' చిత్రాలు ఉన్నాయి. 
 
అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తోనూ మూడు చిత్రాలు నిర్మించారు. అందులో తొలి చిత్రం 'స్టూడెంట్ నంబర్ 1', రెండోది 'సింహాద్రి' కాగా, మరో చిత్రం 'యమదొంగ'. ఇక రామ్ చరణ్‌తో 'మగధీర' చిత్రాన్ని తీయగా, రవితేజతో 'విక్రమార్క', హాస్య నటుడు సునీల్‌తో 'మర్యాద రామన్న', హీరో నానితో 'ఈగ' వంటి చిత్రాలు చేశారు. మహేష్ బాబుతో రాజమౌళి చిత్రాన్ని నిర్మించలేదన్న వెలితి సినీ ప్రేక్షకుల్లో ఉండిపోయింది. ఇపుడు అది కూడా త్వరలోనే నెరవేరనుంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే వచ్చేయేడాది దసరాకు ఈ చిత్రం పట్టాలెక్కవచ్చని ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments