Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలు తీసుకోలేదా..? పారితోషికం పెంచేసిన రష్మిక మందన్న!

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (10:55 IST)
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అందాల తార రష్మిక మందన్న టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. భారీగా పాపులారిటీ సంపాదించింది. 
 
"పుష్ప" విజయం తర్వాత రష్మిక మందన్న పారితోషికం పెరిగింది. ఇంకా బాలీవుడ్ చిత్రం "యానిమల్" భారీ విజయం తర్వాత మళ్లీ రెమ్యూనరేషన్ పెంచేసింది. రష్మిక మందన్న ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం రూ.4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక మందన్న ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డీఎన్ఎస్, పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రూ.3 నుంచి 3.5 కోట్ల వరకు రష్మిక సంతకాలు చేసినట్లు టాక్ వస్తోంది. ఇప్పుడు అదనంగా రష్మిక కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక ప్రస్తుతం అదనంగా పారితోషికం డిమాండ్ చేయడం తప్పేమీ కాదని.. హీరోలు తమ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ సాధించినప్పుడు వారి వేతనాలు 50 శాతానికి పైగా పెరుగుతాయి. 
 
మరోవైపు కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలు ఇప్పటికే రూ.4 కోట్లు సంపాదిస్తున్నారు. అలియా భట్ , దీపికా పదుకొణె 8 నుండి 12 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఈ అంశాలను పరిశీలిస్తే, రష్మిక ధర రూ. 4 నుండి 4.5 కోట్లు అడగడం తప్పేమీ కాదని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments