Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలు తీసుకోలేదా..? పారితోషికం పెంచేసిన రష్మిక మందన్న!

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (10:55 IST)
కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అందాల తార రష్మిక మందన్న టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. పుష్ప, యానిమల్ వంటి సినిమాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. భారీగా పాపులారిటీ సంపాదించింది. 
 
"పుష్ప" విజయం తర్వాత రష్మిక మందన్న పారితోషికం పెరిగింది. ఇంకా బాలీవుడ్ చిత్రం "యానిమల్" భారీ విజయం తర్వాత మళ్లీ రెమ్యూనరేషన్ పెంచేసింది. రష్మిక మందన్న ప్రస్తుతం తన తదుపరి సినిమాల కోసం రూ.4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక మందన్న ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డీఎన్ఎస్, పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ రూ.3 నుంచి 3.5 కోట్ల వరకు రష్మిక సంతకాలు చేసినట్లు టాక్ వస్తోంది. ఇప్పుడు అదనంగా రష్మిక కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది.
 
రష్మిక ప్రస్తుతం అదనంగా పారితోషికం డిమాండ్ చేయడం తప్పేమీ కాదని.. హీరోలు తమ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ సాధించినప్పుడు వారి వేతనాలు 50 శాతానికి పైగా పెరుగుతాయి. 
 
మరోవైపు కియారా అద్వానీ వంటి బాలీవుడ్ భామలు ఇప్పటికే రూ.4 కోట్లు సంపాదిస్తున్నారు. అలియా భట్ , దీపికా పదుకొణె 8 నుండి 12 కోట్ల వరకు వసూలు చేస్తారు. ఈ అంశాలను పరిశీలిస్తే, రష్మిక ధర రూ. 4 నుండి 4.5 కోట్లు అడగడం తప్పేమీ కాదని సినీ పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments