Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండే చచ్చిపోయిందంటే చచ్చినా నమ్మలేదంటున్న పూనమ్ భర్త సామ్

ఐవీఆర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పూనమ్ పాండే. గర్భాశయ కేన్సర్ పైన అవగాహన కల్పించేందుకని తను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించుకున్నది. ఒకరోజంతా ఆ ప్రచారం మీడియాలో జరిగింది. దీనిపై సినీ ప్రపంచంలోని కొంతమంది తారలతో పాటు పూనమ్ అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.

ఐతే మరుసటిరోజు తను చనిపోలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది పూనమ్. కేవలం గర్భాశయ కేన్సర్ పైన ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డట్లు వివరించింది. ఐతే దీనిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు ఇలాంటి దారిని ఎంచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరికొందరైతే పూనమ్ పాండేపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త తెలిసి తనకేమీ బాధ కలగలేదని ఆమె భర్త సామ్ బాంబే అన్నారు. ఆమెతో కనెక్ట్ అయి వున్నవారు ఆమె చెప్పే మాటలు ఎలా వుంటాయో ఇట్టే అర్థమవుతుందని అన్నాడు. నేను ప్రతిరోజూ ఆమె గురించి విపరీతంగా ఆలోచిస్తాననీ, అందువల్ల ఆమె చనిపోయి వుండదని నాకు ఎక్కడో అనిపించిందనీ, బతికే వున్నందుకు సంతోషంగా వుందని చెప్పాడు. పూనమ్ పాండే- సామ్ బాంబేకి 2020లో పెళ్లయ్యింది. ఐతే తనను హింసిస్తున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టి అతడితో విడిపోయింది పూనమ్ పాండే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments