పూనమ్ పాండే చచ్చిపోయిందంటే చచ్చినా నమ్మలేదంటున్న పూనమ్ భర్త సామ్

ఐవీఆర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పూనమ్ పాండే. గర్భాశయ కేన్సర్ పైన అవగాహన కల్పించేందుకని తను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించుకున్నది. ఒకరోజంతా ఆ ప్రచారం మీడియాలో జరిగింది. దీనిపై సినీ ప్రపంచంలోని కొంతమంది తారలతో పాటు పూనమ్ అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.

ఐతే మరుసటిరోజు తను చనిపోలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది పూనమ్. కేవలం గర్భాశయ కేన్సర్ పైన ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డట్లు వివరించింది. ఐతే దీనిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు ఇలాంటి దారిని ఎంచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరికొందరైతే పూనమ్ పాండేపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త తెలిసి తనకేమీ బాధ కలగలేదని ఆమె భర్త సామ్ బాంబే అన్నారు. ఆమెతో కనెక్ట్ అయి వున్నవారు ఆమె చెప్పే మాటలు ఎలా వుంటాయో ఇట్టే అర్థమవుతుందని అన్నాడు. నేను ప్రతిరోజూ ఆమె గురించి విపరీతంగా ఆలోచిస్తాననీ, అందువల్ల ఆమె చనిపోయి వుండదని నాకు ఎక్కడో అనిపించిందనీ, బతికే వున్నందుకు సంతోషంగా వుందని చెప్పాడు. పూనమ్ పాండే- సామ్ బాంబేకి 2020లో పెళ్లయ్యింది. ఐతే తనను హింసిస్తున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టి అతడితో విడిపోయింది పూనమ్ పాండే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments