Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనమ్ పాండే చచ్చిపోయిందంటే చచ్చినా నమ్మలేదంటున్న పూనమ్ భర్త సామ్

ఐవీఆర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (20:31 IST)
పూనమ్ పాండే. గర్భాశయ కేన్సర్ పైన అవగాహన కల్పించేందుకని తను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించుకున్నది. ఒకరోజంతా ఆ ప్రచారం మీడియాలో జరిగింది. దీనిపై సినీ ప్రపంచంలోని కొంతమంది తారలతో పాటు పూనమ్ అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.

ఐతే మరుసటిరోజు తను చనిపోలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను వదిలింది పూనమ్. కేవలం గర్భాశయ కేన్సర్ పైన ప్రజల్లో అవగాహన కల్గించేందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డట్లు వివరించింది. ఐతే దీనిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు ఇలాంటి దారిని ఎంచుకోవడం దారుణమని మండిపడుతున్నారు. మరికొందరైతే పూనమ్ పాండేపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... పూనమ్ పాండే చనిపోయిందన్న వార్త తెలిసి తనకేమీ బాధ కలగలేదని ఆమె భర్త సామ్ బాంబే అన్నారు. ఆమెతో కనెక్ట్ అయి వున్నవారు ఆమె చెప్పే మాటలు ఎలా వుంటాయో ఇట్టే అర్థమవుతుందని అన్నాడు. నేను ప్రతిరోజూ ఆమె గురించి విపరీతంగా ఆలోచిస్తాననీ, అందువల్ల ఆమె చనిపోయి వుండదని నాకు ఎక్కడో అనిపించిందనీ, బతికే వున్నందుకు సంతోషంగా వుందని చెప్పాడు. పూనమ్ పాండే- సామ్ బాంబేకి 2020లో పెళ్లయ్యింది. ఐతే తనను హింసిస్తున్నాడంటూ భర్తపై గృహ హింస కేసు పెట్టి అతడితో విడిపోయింది పూనమ్ పాండే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments