Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్‌ బాబును అన్న అని పిలిచిన హీరోయిన్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (22:15 IST)
సరిలేరు నీకెవ్వరు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాల డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఈ సినిమా పెద్ద పరీక్షే. మహేష్ బాబు లాంటి హీరోతో సినిమా అంటే సాధారణమైన విషయం కాదు. అది కూడా లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన విజయశాంతిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం. దీంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
 
సినిమా విడుదలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటే హీరోయిన్ రష్మిక మాత్రం మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షూటింగ్‌కు వచ్చినప్పటి నుంచి మహేష్ బాబు సైలెంట్‌గా కూర్చుంటారు. అసలు ఎవరితోను మాట్లాడరు. దర్శకుడు సన్నివేశాన్ని చెబితే ఆ సన్నివేశంపై ప్రాక్టీస్ చేస్తారు. అది కూడా ఒక్కరే. ఇక పాటలంటారా. డ్యాన్స్ కంపోజ్ సైలెంట్‌గా ఒక్కరే చేసుకుంటూ ఉంటారు.
 
నేను చాలాసార్లు మహేష్‌తో మాట్లాడదామని ట్రై చేశాను. కానీ ఆయన హాయ్.. హల్లో అంటూ వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఒంటరిగా కూర్చుని ఉన్న మహేష్‌ను ఆటపట్టిద్దామని అన్నా అని పిలిచా.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నావైపు చూశారు మహేష్. దీంతో చాలాసేపు ఇద్దరం నవ్వుకున్నాం. ఎందుకలా పిలిచావని మహేష్ నన్ను అడగలేదు. ఎందుకంటే నేను తమాషాగా ఆట పట్టిద్దామని అలా పిలిచినట్లు మహేష్ బాబుకు బాగా అర్థమైంది కాబట్టి ఆయన ఆ విషయాన్ని లైట్‌గా తీసుకున్నారని చెబుతోంది రష్మిక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments