చిరంజీవికి షాకిచ్చిన తెలుగువాడైన తమిళ దర్శకుడు??

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:31 IST)
మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం చేసే అవకాశం వస్తే యువ దర్శకులు ఎగిరిగంతేస్తారు. అలాంటిది తెలుగువాడైన ఓ తమిళ దర్శకుడు ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఛాన్స్ టాలీవుడ్ దర్శకుడు వివి.వినాయక్‌కు చేరినట్టు సమాచారం. 
 
అసలేం జరిగిందో తెలుసుకుందాం.. ప్రస్తుతం చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో ఆచార్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ మరో పది పదిహేను రోజుల ఉందనగా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. వచ్చేనెలలో ఆ కాస్త షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 
 
ఆ తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో చేయనున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఇది రొటీన్‌కి భిన్నమైన సినిమాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అందువలన ఆ సినిమా రీమేక్‌లో చేయాలని చిరూ భావించారు.
 
ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తమిళ దర్శకుడు, తెలుగు నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజాకి అప్పగించారు. కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే వాటి విషయంలో చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. 
 
తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణమేమిటనేది మాత్రం తెలియదు. మోహన్ రాజా తప్పుకోవడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments