Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసిన సాయం చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటుంది... అమితాబ్

Webdunia
బుధవారం, 12 మే 2021 (12:12 IST)
దేశ ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పటికీ వారిని ఆదుకునేందుకు సినీ సెలెబ్రిటీలు ఏమాత్రం ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. 
 
ఢిల్లీలోని కొవిడ్ సెంటర్‌కు తాను 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చర్చ జరిగిందన్న అమితాబ్.. చేసిన సాయాన్ని చెప్పుకోవడం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయినా విమర్శల నేపథ్యంలో చెప్పక తప్పడం లేదన్నారు. కరోనా బాధితుల సహాయార్థం తాను ఇప్పటివరకు చేసిన సాయం మొత్తం విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. 
 
ఇప్పటివరకు తానేం చేసినదీ కూడా అమితాబ్ చెప్పుకొచ్చారు. ముంబై జుహూలో 25-50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చానని, ఫ్రంట్లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ముంబై ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలను సమకూర్చినట్టు చెప్పారు. 
 
ఎంతోమంది పేద రైతులను ఆదుకున్నానని, ఇంత పెద్ద సాయం తనకు కష్టమైనా సరే ఆనందంగా చేశానని అమితాబ్ వివరించారు. అలాగే, 20 వెంటిలేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చానని, వాటిలో ఇప్పటికే పది అందుబాటులోకి వచ్చాయని అమితాబ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments