Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ పైన రూ. 35 కోట్లు వస్తుందా? హనూ... నువ్వు మారవా?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:33 IST)
శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు. ఈ సినిమాకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే... హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి సినిమాని ఎంత బాగా తెర‌కెక్కించాడో తెలిసిందే. ఆ సినిమాని చెక్కుతూ తీయ‌డం వ‌ల‌న బ‌డ్జెట్ పెరిగింది. సినిమా ఫ్లాప్ అవ్వ‌డం వ‌ల‌న లాస్ వ‌చ్చింది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా కూడా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ట. కాక‌పోతే నాని వ‌ల‌న నిర్మాత లాస్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.
 
లై సినిమా దారుణ ఫలితాన్ని మిగిల్చింది. సినిమాకు యావరేజ్ టాక్ రాగా.. వచ్చిన వసూళ్లు బడ్జెట్లో సగం కూడా లేవు. ఆ చిత్రం మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేశారు. వర్కింగ్ డేస్ పెరిగి బడ్జెట్ అదుపు తప్పింది. ఏకంగా రూ.40 కోట్ల దాకా పెట్టించేశాడు హను. దీంతో నిర్మాతలు నిండా మునిగిపోయారు. 14 రీల్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి మళ్లీ సినిమానే రాలేదంటే ఆ సినిమా ఎఫెక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
తాజా చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు వ‌ర్కింగ్ డేస్ ఎక్కువ కావ‌డం వ‌ల‌న 30 కోట్లు దాటింది. ఫైనాన్స్ వ‌డ్డీలు క‌లుపుకుంటే 35 కోట్లు అయ్యింద‌ట‌. ఈ సినిమా పాజిటివ్ టాక్ ఉంది కానీ... శ‌ర్వానంద్ పైన 35 కోట్లు వ‌స్తుందా అనేది అనుమాన‌మే. హ‌ను రూటు మార్చి బ‌డ్జెట్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి లేదంటే కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments