చిరు సిస్టర్ రోల్‌కి ఇద్దరు హీరోయిన్లు పోటీ? (video)

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (13:05 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తతం ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అయితే, ఈ ప్రాజెక్టు తెలుగులో చిరంజీవి చేయనున్నారనే వార్త లీకైనప్పటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. తమిళంలో హీరో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ నటించి మెప్పించి, మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఇపుడు తెలుగులో ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశంపై తెగ చర్చ సాగుతోంది. ముఖ్యంగా, చిరంజీవి సోద‌రిగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో పేరు తైర‌పైకి వ‌చ్చింది. చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో కీర్తిసురేశ్ పేరును కూడా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. 
 
తమిళ వెర్షన్‌లో ల‌క్ష్మీ మీన‌న్ ప్రేక్ష‌కులను మెప్పించింది. దీంతో ల‌క్ష్మీమీన‌న్ రోల్‌లో అవార్డు విన్నింగ్ హీరోయిన్లైన సాయిప‌ల్ల‌వి, కీర్తిసురేశ్‌ల‌లో ఎవ‌రిని  చిరు అండ్ టీం ఎంపిక చేస్తార‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుత ఈ చిత్రాన్ని నటీనటుల ఎంపికపై దర్శకుడు మెహర్ రమేష్ కసరత్తు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments