Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మల్టీస్టారర్.. చెర్రీకి, ఎన్టీఆర్‌లకు పారితోషికం లేదా?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:55 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వీరు భారీగా పారితోషికం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి చెరొక రూ.30 కోట్ల పారితోషికం అందేలా చూస్తారని టాక్. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 
భారీ బడ్జెట్ సినిమా కావడంతో పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్‌కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు వస్తుందని టాక్. సినిమా బిజినెస్‌ని బట్టి చరణ్, ఎన్టీఆర్‌లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. 
 
రాజమౌళికి ఎలా లేదన్నా.. రూ.50-60 కోట్లు వరకు వచ్చే అవకాశం వుంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan : జగన్‌ కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలిక.. సెల్ఫీ తీసుకున్న వైకాపా చీఫ్.. వీడియో వైరల్ (video)

ఆ అమ్మాయితో వాట్సప్ ఛాటింగ్ ఏంట్రా?: తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments