Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో "లూసిఫర్" రీమేక్... మెగాస్టార్‌తో స్టైలిష్ స్టార్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:33 IST)
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రంలో నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని ఆయన తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కన్ను ఈ చిత్రం రీమేక్‌పై పడింది. దీంతో మలయాళ హక్కులను చిరంజీవి తనయుడు హీరో కమ్ నిర్మాత రాంచరణ్ భారీ మొత్తానికే కొనుగోలు చేశారు.
 
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి  చేసిన తర్వాత లూసిఫర్ రీమేక్‌పై చిరంజీవి దృష్టిసారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఓ పాత్రలో అంటే చిరంజీవికి నమ్మినబంటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
కాగా, 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments