Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో "లూసిఫర్" రీమేక్... మెగాస్టార్‌తో స్టైలిష్ స్టార్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:33 IST)
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రంలో నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని ఆయన తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కన్ను ఈ చిత్రం రీమేక్‌పై పడింది. దీంతో మలయాళ హక్కులను చిరంజీవి తనయుడు హీరో కమ్ నిర్మాత రాంచరణ్ భారీ మొత్తానికే కొనుగోలు చేశారు.
 
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి  చేసిన తర్వాత లూసిఫర్ రీమేక్‌పై చిరంజీవి దృష్టిసారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఓ పాత్రలో అంటే చిరంజీవికి నమ్మినబంటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
కాగా, 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments