Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవిలో ఇయర్ ఫోన్... నాంపల్లి రైల్వేస్టేషన్ పట్టాలు దాటుతూ మహిళ...

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (15:59 IST)
ఓ మహిళ నిర్లక్ష్యం తన ప్రాణాలను తీసింది. చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటన నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన రేఖా మహల్‌(25) టెలిఫోన్‌ భవన్‌ ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఉంటూ లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 
 
గురువారం ఉదయం జిమ్‌కు వెళ్లి హాస్టల్‌కి తిరిగి వస్తుండగా మధ్యలో రైలు పట్టాలు దాటవలసి వచ్చింది. పట్టాల వద్ద ఉన్న చెక్ పోస్ట్ దాటి లోపలికి ప్రవేశించింది. బేగంపేట నుంచి నాంపల్లి వైపుకు వెళ్లే రైలు వెళ్లిపోవడంతో లైన్ క్లియర్ అయిందని భ్రమపడింది. కానీ మరో రైలు వస్తోందని గమనించలేదు. 
 
ఇంతలో నాంపల్లి నుండి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలును చూసుకోకుండా పట్టాలు దాటడానికి ముందుకు నడిచింది. రైలు ఢీకొట్టి క్రిందపడిపోయింది. స్థానికులు పోలీసుల సహాయంతో ఆమెను గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలవడంతో ఆ మహిళ అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments