కుమారుడికి పెళ్లి నిశ్చయమైందని అందరికీ చెప్పింది.. ఇంటికొచ్చి చూస్తే?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (15:46 IST)
కొడుకు పెళ్లి నిశ్చయం అయిందని అందరికీ చెప్పి ఇంటికి వచ్చిన తల్లికి ఆ కొడుకు కన్నీరు మిగిల్చాడు. ఇంట్లో జరిగిన ఘటన చూసి ఆమె హృదయం విలవిలలాడింది. సంతోషంగా నిశ్చితార్థం జరగాల్సిన ఇంట్లో శవం కనిపించడం ఆమెను కలతకు గురిచేసింది. 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని గాజులరామారం డివిజన్ బాలయ్య నగర్‌కు చెందిన సాయమ్మ కొడుకు సంగమేష్‌కి గోపన్ పల్లికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల ఎనిమిదవ తేదీన కొడుకుకి నిశ్చితార్థం చేయాలనుకుంది. ఎడవ తేదీ ఉదయం సాయమ్మ డ్యూటీకీ వెళ్లింది. అక్కడ అందరికీ తన కొడుకు నిశ్చితార్థం గురించి చెప్పి ఆహ్వానించింది. 
 
ఉదయం డ్యూటీకి వెళ్లిన ఆమె మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చింది. తలుపు ఎంత తట్టినా ఎవరూ తీయలేదు. లోపల నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. అనుమానం వచ్చిన సాయమ్మ కిటికీలోంచి చూసింది. పెళ్లి జరగవలసిన కొడుకు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. చిరతో ఇనుపరాడ్డుకు ఉరివేసుకుని చనిపోయాడు. 
 
ఈ ఘటన చూసి ఆమె కన్నీరు మున్నీరు అయింది. ఆమె అరుపులు విని చుట్టుప్రక్కల వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి శవాన్ని క్రిందకు దించారు. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

తర్వాతి కథనం
Show comments