Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులతో షర్మిల భేటీ ఎందుకబ్బా?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:48 IST)
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో బుధవారం వైఎస్‌ షర్మిల సమావేశం కానున్నారు. లోట్‌సపాండ్‌లో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు షర్మిల బృందం వెల్లడించింది.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తీరు తదితర అంశాలపైన విద్యార్థుల అభిప్రాయాలను ఆమె స్వీకరిస్తారు. కాగా, మంగళవారం ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి పలువురు అభిమానులు వచ్చి షర్మిలను కలిశారు. జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి కూడా షర్మిలను కలిసి, కాసేపు మాట్లాడారు.
 
కొత్తగా పార్టీ పెట్టబోతున్న వైఎస్‌ షర్మిలకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి ప్రభాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. ఇటీవలే షర్మిలను కలిసి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. మంగళవారం ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

షర్మిల సన్నిహిత బంధువు ఒకరు ఆయనతో పాటు ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిలకు మద్దతు తెలిపేందుకు, అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభాకర్‌రెడ్డి అంగీకరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments