Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఎమ్మార్వో విజయా రెడ్డిపై ఎందుకిలా? భద్రత డొల్లతనం

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (20:06 IST)
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం తీవ్ర సంచలనం సృష్టించింది. సమయపాలన, క్రమశిక్షణ ఆమెకి ప్రాణం. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేసే ఎమ్మార్వో విజయారెడ్డి గత ఏడాది ఉత్తమ ఎమ్మార్వోగా ఎంపికై కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. అటువంటి అధికారిణిపై దారుణానికి పాల్పడి సజీవ దహనం చేశాడు సురేష్ అనే రైతు. 
 
పైగా ఆమె తన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో వేధించారనీ, డబ్బులు అడిగారంటూ నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఐతే ఉత్తమ ఎమ్మార్వోగా వున్న విజయారెడ్డిపై నిందితుడు చేసిన ఆరోపణలను ఖండించింది ఎమ్మార్వోల సంఘం. మరోవైపు ఓ వ్యక్తి కిరోసిన్ బాటిల్‌తో లోపలికి, అదికూడా ఓ మేజిస్ట్రేట్ అధికారిణి వద్దకు వెళ్లాడంటే అక్కడ భద్రత ఎంత డొల్లతనంగా వుందో అర్థమవుతుంది.
 
విజయా రెడ్డి విద్యార్థిని స్థాయి నుంచే పట్టుదల కలిగిన యువతి అని ఆమె తండ్రి చెప్పారు. తొలుత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె ఆ తర్వాత ఎంతో కష్టపడి గ్రూప్ 2 పరీక్ష రాసి ఉత్తీర్ణురాలయ్యారు. అప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పదవికి రాజీనామా చేసి ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. ఈమె సొంత వూరు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి. ఆమె భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్‌ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments