Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఏం చేయాలి?.. రేవంత్‌రెడ్డి

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (05:43 IST)
‘‘చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి రాని ఆయనపైన పీడీ చట్టం ప్రయోగించి.. అండమాన్‌ జైల్లో పెట్టాలా?’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని నిలదీశారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్‌ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వారు సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్న తర్వాతే ప్రైవేటీకరణ అంశం ముందుకు వచ్చిందని ఆరోపించారు. కొత్తగా 350 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఎవరి కోసమో ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments