ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఏం చేయాలి?.. రేవంత్‌రెడ్డి

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (05:43 IST)
‘‘చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి రాని ఆయనపైన పీడీ చట్టం ప్రయోగించి.. అండమాన్‌ జైల్లో పెట్టాలా?’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని నిలదీశారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్‌ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వారు సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్న తర్వాతే ప్రైవేటీకరణ అంశం ముందుకు వచ్చిందని ఆరోపించారు. కొత్తగా 350 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఎవరి కోసమో ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments