Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్లుగా సచివాలయానికి రాని కేసీఆర్‌ను ఏం చేయాలి?.. రేవంత్‌రెడ్డి

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (05:43 IST)
‘‘చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి రాని ఆయనపైన పీడీ చట్టం ప్రయోగించి.. అండమాన్‌ జైల్లో పెట్టాలా?’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఉద్యమ సమయంలో పోరాట యోధుల్లా కనిపించినవారు ఇప్పుడు బానిసలు, కుక్క తోకలుగా కనిపిస్తున్నారా అని నిలదీశారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్‌ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ కంపెనీలో రూ.వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన వారు సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకున్న తర్వాతే ప్రైవేటీకరణ అంశం ముందుకు వచ్చిందని ఆరోపించారు. కొత్తగా 350 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ఎవరి కోసమో ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments