Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో అందుకే కరోనా వ్యాప్తి... రాములమ్మ విశ్లేషణ

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (08:11 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. ‘ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణను లాక్‌డౌన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణాన్ని విశ్లేషిస్తూ... ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉన్న వందలాది మంది కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్‌లకు తరలించడం వల్లే ఈ సమస్య పెద్దదయిందని కొంతమంది వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజు తెలంగాణ సమాజం ఇంత ఆందోళన చెందడానికి కూడా ఇదే కారణమని వారు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని నెలలుగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఎలాంటి వైద్య పరీక్షలూ చేయకుండా, ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరించిందని విమర్శలు వస్తున్నాయి.

కానీ రాజకీయ విమర్శలు చేయడానికి ఇది సందర్భం కాదు గనక... ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి, తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు.. ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉంద’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments