Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూల వాగుపై వంతెన మళ్లీ కూలింది...

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలింది. 
 
గతంలో ఓసారి వరద దాటికి కొట్టుకుపోయినా తాజాగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మళ్లీ కొట్టుకుపోవటంతో నాణ్యతపై అనుమానాలొస్తున్నాయి. కమిషన్ల కక్కుర్తికి ఇదే సాక్ష్యం అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
 
ఈ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి భక్తులకు గుడికి వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు దారులుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 28 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాల క్రితం ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. 
 
కానీ పనులు నత్తనడక సాగుతుండటం, వర్షాకాలంలో వాగు ప్రవహించటంతో పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇపుడు నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలడంతో ఈ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments