Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కదిరి -పులివెందుల సరిహద్దులో భారీ వర్షంతో తెగిన బ్రిడ్జి

'కదిరి -పులివెందుల సరిహద్దులో భారీ వర్షంతో తెగిన బ్రిడ్జి
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:11 IST)
పులివెందుల, కదిరి నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలో భారీ వ‌ర్షాలు తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించాయి. తలుపుల మండలం గొల్లపల్లి తండా పైభాగంలోని చిన్నపల్లి-ఉడుముల కుర్తి గ్రామాల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు గొల్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.

పులివెందుల సమీపంలోని కనంపల్లి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై గొల్లపల్లి తండా వరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గురువారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలను నిలిపి వేయించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ప్రమాదాన్ని నివారించారు.

భారీ వర్షాలకు నామాలగుండు వంక  నీటి ప్రవాహంతోఉద్ధృతంగా ప్రవహించింది. కనంపల్లి సమీపంలోని అరటి, మామిడి ఇతర రకాలైన పంట పొలాలు నీట మునిగాయి. భూములు కోతకు గురయ్యాయి. పులివెందుల కదిరి పట్టణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ రెండువైపులా నిలిచిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్ 5 న ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియకు సన్మానం