Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీట మునిగిన సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

నీట మునిగిన సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
, మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణం నీటమునిగింది. మంగళవారం రాత్రి భారీ వ‌ర్షం కురియ‌డంతో వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో ప‌లు కాల‌నీల్లో వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. అనేక వీధుల్లో నడంలోతు నీళ్లు వచ్చి నిలిచివున్నాయి. ఈ నీటిలో కార్లు మునిగిపోయివున్నాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌ల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గ‌త మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ముంపున‌కు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. 
 
సహాయక చర్యల కోసం హైద‌రాబాద్‌ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షం కోసం బాలికలను నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?