Webdunia - Bharat's app for daily news and videos

Install App

గండిపేట రిజర్వాయర్ వద్ద విగతజీవిగా అమెరికన్ పౌరుడు .. ఎలా?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (08:34 IST)
అమెరికా పౌరుడు ఒకరు హైదరాబాద్ గండిపేటలో శవమై కనిపించాడు. తమ కళ్ల ముందు సైక్లింగ్ చేస్తూ వచ్చిన ఈ వ్యక్తి విగతజీవిగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అమెరికా యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మృతిపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన రాబర్ట్ పాల్ (28) ఆయన భార్య అంజలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. 
 
అయితే, ప్రతి రోజూ వ్యాయామం నిమిత్తం ఉదయం, సాయంత్రం వేళల్లో సైక్లింగ్ చేసేవాడు. ఇందులోభాగంగా, రెండో రోజుల క్రితం కూడా ఉదయాన్ని సైక్లింగ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, పాల్ మృతదేహం రోడ్డుపై కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments