Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా జైళ్లలో 161 మంది భారతీయులు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (06:21 IST)
161 మంది భారతీయులను అమెరికా అదుపులోకి తీసుకుంది. వారిని ఈ వారంలో వెనక్కు పంపనున్నట్లు తెలిపింది. వారికి ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఒక ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌కు పంపించనుంది.

వీరిలో 76 మంది హర్యానాకు చెందిన వారు ఉన్నారు. అలాగే పంజాబ్‌కు చెందిన 56మంది, గుజరాత్‌ కు చెందిన 12 మంది, యుపికి చెందిన ఐదుగురు, మహారాష్ట్రకు చెందిన నలుగురు, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు చెందిన వారు ఇద్దరు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌, గోవా రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

వివరాల ప్రకారం.. అమెరికాలోని 95 జైళ్లలో ఉన్న 1,739 మంది ఖైదీల్లో వీరు ఉన్నారని నార్త్‌ అమెరికన్‌ పంజాబీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నామ్‌ సింగ్‌ చాహాల్‌ తెలిపారు. వీరందరినీ తమ దేశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారంటూ, ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ అదుపులోకి తీసుకుంది.

వీరంతా దక్షిణ మెక్సికో సరిహద్దుల నుంచి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అమెరికా ఆరోపిస్తోంది. ఐసిఇ నివేదిక ప్రకారం.. 2018లో 611 మందిని భారత్‌కు తిరిగి పంపగా, గతేడాది 1,616 మందిని వెనక్కు పంపింది.

ఇక ఇప్పుడు తిరిగి పంపిస్తున్న 161 మందిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారని, ఇప్పటికీ అమెరికన్‌ జైళ్లలో ఉన్న ఇతర భారతీయుల పరిస్థితిపై సమాచారం లేదని సత్నామ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments