Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టొద్దు.. రేవంత్

Webdunia
ఆదివారం, 22 మే 2022 (17:40 IST)
తాము అభివృద్ధికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, కానీ, అభివృద్ధి పేరిట పచ్చని పొలాల్లో చిచ్చుమాత్రం పెట్టొద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి తెలంగాణా వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, శనివారం వరంగల్ జిల్లాలో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆయనకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా సీఎం కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. 
 
తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు పోగొట్టుకున్న రైతుల కష్టాలను ఆయన తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. జయశంకర్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. 
 
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కోసం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణకు సిద్ధమైందని విమర్శించారు. అదేసమయంలో తాము అభివృద్ధికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదన్నారు. కానీ, అభివృద్ధి పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చు పెట్టొద్దని ఆయన కోరారు. అలాగే అనేక అంశాలను రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments