Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ లేకుంటే ఆ గాడిదలకు పదవులు వచ్చేవా? మంత్రి కేటీఆర్

Webdunia
గురువారం, 5 మే 2022 (07:39 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించే వారికి తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే కౌంటరిచ్చారు. కేసీఆర్ అనే నాయకుడు లేకుండా ఆయనపై విమర్శలు చేసే గాడిదలకు పదవులు వచ్చేవా అని సూటిగా ప్రశ్నించారు. 
 
సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలు పనికిమాలిన దద్దమ్మలన్నారు. సీఎం పదవిని, వయసును చూడకుండా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
తెలంగాణ తెచ్చిన నాయకుడిని సోయి మరిచి రోడ్ల మీద తిరుగుతూ కేసీఆర్‌పై అడ్డం పొడుపు మాట్లాడుతున్న గాడిదలకు పదవులు వచ్చేవా? అని ప్రశ్నించారు. కేసీఆర్, తెరాస లేకుంటే జీవితంలో తెలంగాణ వచ్చేదా? టీ కాంగ్రెస్, టీబీజేపీ ఉండేవా? పదవులు ఉన్నాయి కాబట్టే గౌరవిస్తున్నారు. 
 
పదవులే లేకుంటే మిమ్మల్ని గంజిలో ఈగలా తీసిపడేసేటోళ్ళు" అని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన కాలిగోటికి సరిపోనోళ్లు, ఎగిరెగిరి మాట్లాడుతున్నోళ్లు దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలని ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments