Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలపై పేలాలు ఏరుకునే వైద్యుడు.. సస్పెండ్

Webdunia
గురువారం, 5 మే 2022 (07:21 IST)
ఆర్థిక సమస్యలతో ఉరేసుకున్న వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష చేసేందుకు డబ్బులు (లంచం) డిమాండ్ చేసిన వైద్యుడిపై ఏపీ ప్రభుత్వ వైద్యశాఖాధికారులు చర్యలు తీసుకున్నారు. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు డబ్బులు అడిగినందుకు డాక్టర్ బాషాను సస్పెండ్ చేశారు. ఆర్థిక కష్టాలతో తన భర్త ఆత్మహత్య చేసుకుంటే, మళ్లీ పోస్టు మార్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన మృతుని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
అసలే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఆమెను వైద్యుడు మాటలు మరింతగా బాధపెట్టాయి. పోస్టు మార్టం చేసేందుకు రూ.16 వేలు తక్షణం ఫోన్ పే చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ లంచగొండి డాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments