Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కట్నం డబ్బు కోసం భార్యపై అత్యాచారం చేయించిన ఉన్మాది భర్త

rape
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (10:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ కట్నపిశాచి అత్యంత హేయంగా ప్రవర్తించాడు. కట్నం డబ్బుల కోసం కట్టుకున్న భార్యను తన ఇద్దరు బంధువులతో అత్యాచారం చేయించాడు. ఈ పెళ్లి 2019లో జరిగింది. అప్పటినుంచి వరకట్న వేధింపులు జరుగుతున్నాయి. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‍‌లో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరత్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి అదే రాష్ట్రానికి చెందిన యువతితో వివాహమైంది. వివాహానికి ముందు కట్నకానులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, వివాహం తర్వాత అత్తింటివారు చెప్పిన కట్నం 1.50 లక్షల రూపాయల ఇవ్వలేక పోయారు. 
 
దీంతో తన బంధువులు ఇద్దరితో భార్యపై అత్యాచారం చేయించాడు. దాన్ని ఫోనులో వీడియో తీశాడు. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి తద్వారా డబ్బులు సంపాదించుకుంటానని భార్యను బెదిరించాడు. దీంతో బాధితురాలు భర్తతో పాటు తనపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై పోలీస్ స్టషన్ హౌస్ ఆఫీసర్ దౌలత్ సాహు మాట్లాడుతూ, "ఒక మహిళ అత్యాచారం కేసు నమోదైంది. తన భర్త, ఇద్దరు బంధువులు కలిసి అత్యాచారం చేసినట్టు అందులో పేర్కొన్నారు. పోర్నోగ్రాఫిక్ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినట్టు ఆరోపణ. అయితే, దీన్ని ధృవీకరించాల్సివుంది" అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగివచ్చిన చైనా - భారతీయ విద్యార్థులకు అనుమతి