Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్ను చెల్లింపుదారుగా అడుగుతున్నా... విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? సాక్షి ధోనీ

dhoni - sakshi
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (12:12 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ అపుడపుడూ చేసే ట్వీట్లు పాలకుల గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటాయి. తాజాగా ఆమె సంధించిన ఓ ప్రశ్న కూడా అలాంటిదే. తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో కొన్నేళ్ళుగా కొనసాగుతున్న విద్యుత్ సంక్షోభానికి కారణం ఏంటి? అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "ఓ పన్ను చెల్లింపుదారురాలిగా అడుగుతున్నా... ఎన్నో సంవత్సరాలుగా జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్‌ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే  ఉన్నాం. అయినా విద్యుత్ సంక్షోభం ఉంది" అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంపై సాక్షీ ధోనీ చేసిన ట్వీట్‌కు మద్దతుగా అనేక మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, రీ ట్వీట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిఖర్ ధవాన్ సూపర్బ్ ఇన్నింగ్స్ - చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు