Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారంపై నివేదిక ఇవ్వండి.. గవర్నర్ తమిళిసై

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (17:02 IST)
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ మండిపడ్డారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆమె ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె సూచిస్తూనే, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
 
కాగా, ఇటీవల అమ్నీషియా పబ్ నుంచి ఓ బాలికను మైనర్లతో కలిపి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విపక్ష పార్టీల నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ అత్యాచార ఘటన వెనుక తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు మైనార్టీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, తెరాస కీలక నేత కుమారుడు సహా ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం