Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారంపై నివేదిక ఇవ్వండి.. గవర్నర్ తమిళిసై

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (17:02 IST)
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ మండిపడ్డారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆమె ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె సూచిస్తూనే, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
 
కాగా, ఇటీవల అమ్నీషియా పబ్ నుంచి ఓ బాలికను మైనర్లతో కలిపి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విపక్ష పార్టీల నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ అత్యాచార ఘటన వెనుక తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు మైనార్టీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, తెరాస కీలక నేత కుమారుడు సహా ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం