Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం : మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:27 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి వంటి నేత కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టకరమని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన శనివారం జరిగిన సభలో పాల్గొని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 
 
హైదరాబాద్ నగరానికి కేంద్రం ఇప్పటివరకు వరద సాయం అందించలేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మనసు రావడం లేదన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. 
 
ఇదేసమయంలో కంటోన్మెంటో అధికారులపై ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వాల్లు రోడ్లు బంద్ చేస్తే తాము కరెంట్, నీళ్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తానని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments