Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు : వివాదం - ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రజలను నియంత్రించారు. 
 
బోధన్‌లో శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మైనార్టీ నేతలు బైఠాయించి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలను కూడా మొహరించారు. ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసి, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments