తెలంగాణాలో మారిపోయిన వాతావరణం.. 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 9 మే 2023 (08:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో వింతైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటివరకు చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, ఇపుడు ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఫలితంగా మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేరకు నమోదుకానున్నాయి. 
 
మొన్నటివరకు తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కనిపించింది. కానీ, సోమవారం మాత్రం ఎండను, ఉక్కపోతను తట్టుకోలేని వింతైన పరిస్థితి కనిపించింది. రాష్ట్రంలో అకాల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సోమవారం నుంచి వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్ర పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇపుడు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. 
 
బుధవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాలలో 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైదీలకు 23 చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం : సౌమ్య మిశ్రా

హనీ మేడమ్ సెల్ఫీ ప్లీజ్ అంటూ నటి నడుమును అసభ్యంగా తాకిన వ్యక్తి, వీడియో వైరల్

Salman Khan: సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో చిత్రం ప్రకటన

Hema: ఆ టైంలో మా ఇంటికి పనిమనిషి కూడా రానంది : హేమ ఆవేదన

Dhurandhar sequel collections:: ధురందర్ ది రివెంజ్ 11 రోజుల్లోనే ₹1365 కోట్లను వసూలు చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

తర్వాతి కథనం
Show comments