డ్రగ్స్‌ కల్చర్‌కు చెక్.. వెయ్యి మందితో టీమ్.. తేడా వస్తే తాట తీయండి!

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (17:48 IST)
డ్రగ్స్‌ దందాపై తెలంగాణలోని కేసీఆర్‌ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు ఏకంగా 1000 మందితో కౌంట‌ర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ను నియ‌మించింది తెలంగాణ సర్కారు. డ్రగ్స్‌ కట్టడి విషయంలో ఎంతటివారినైనా వదలొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 
నేరస్తులను కాపాడేందుకు రాజకీయ నేతలు సిఫార్సు చేసినా.. తిరస్కరించాలన్నారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌.. పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. 
 
డ్రగ్స్ కంట్రోల్ కోసం అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సెలరేషన్ ప్రమోషన్లు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు కేసీఆర్. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
 
రాష్ట్రంలో అసలు డ్రగ్స్ మాట వినిపించకూడదంటున్న సీఎం కేసీఆర్‌.. తేడా వస్తే తాట తీసేందుకు కూడా వెనకాడొద్దంటూ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో స్కాట్‌లాండ్‌ తరహా డ్రగ్‌ కంట్రోలింగ్‌ చేపట్టాలని సూచించారు.
 
డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, యాడ్స్‌కు సబ్సిడీ కూడా ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments