Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తులపై పంజా విసిరిన మృత్యువు.. ముగ్గురు మృతి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (13:02 IST)
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భక్తులపై మృత్యువు పంజా విసిరింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికివస్తూ ఈ ప్రమాదానిగి గురయ్యారు. ఫలితంగా ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లి గ్రామానికి చెందిన నవీన్ ఉప్పల్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, లింగాల ఘనాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్, మెట్‌పల్లి మండలం మెట్ల చింతాపూర్ గ్రామానికి చెందిన వినీత్‌లు ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. 
 
వీరంతా కలిసి శ్రీ లక్ష్మి నరిసింహా స్వామి దర్శనం కోసం యాదాద్రికి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ ముగ్గురు వస్తున్న ద్విచక్రవాహనం ప్రమాదానికి గురికావడంతో మృత్యువాతపడ్డారు. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments