Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది : సంజయ్ రౌత్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:46 IST)
ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను భారతీయ జనతా పార్టీ బెదిరిస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయంతెల్సిందే. శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 
 
ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీ అని ఆయన ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందన్నారు. అదేసమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తుందని ఆరోపించారు. 
 
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 47మంది ఎమ్మెల్యేలు షిండే గూటికి చేరగా, వీరిలో 37 మంది ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తరపున ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments