Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోంది : సంజయ్ రౌత్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:46 IST)
ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను భారతీయ జనతా పార్టీ బెదిరిస్తుందని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయంతెల్సిందే. శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. 
 
ఈ పరిణామాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం బీజేపీ అని ఆయన ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందన్నారు. అదేసమయంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తుందని ఆరోపించారు. 
 
మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేల బలం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతు నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 47మంది ఎమ్మెల్యేలు షిండే గూటికి చేరగా, వీరిలో 37 మంది ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తరపున ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments