Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్

polling
, గురువారం, 23 జూన్ 2022 (08:03 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉదయం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇది సాయంత్రం ఆరు గంటల వరకు జరగునుంది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నికను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 12 మంది అభ్యర్థులు ఉన్నారు. అధికార వైకాపా తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ పోటీకి దూరంగా ఉంది. అధికార వైకాపాతో ఉన్న లోపాయికారి ఒప్పందం కారణంగా బీజేపీ స్థానికేతరుడిని అభ్యర్థిగా నిలబెట్టింది. మొత్తంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,388 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు 78 వెబ్ క్యాస్టింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్