Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందెం రాయుళ్ళ దెబ్బకు లాకప్‌లో పందెం కోళ్లు.. అలా నిద్రలేపుతున్నాయ్!

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:03 IST)
పందెం కోళ్లు కటకటాల పాలయ్యాయి. స్వేచ్ఛగా ఆరు బయట తిరుగుతూ ఇష్టమైన ఆహారం తినాల్సిన కోళ్లు పందెం రాయుళ్ళ దెబ్బకు లాకప్‌లో వున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామంలో కొందరు స్థానిక యువకులతో కలిసి ఆంధ్ర యువకులు కోడిపందాలు ఆడుతుండగా పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి యువకులతో పాటు నగదు, రెండు కోళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
యువకుల మీద కేసు నమోదు చేసి నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసి భద్ర పరచి కోళ్లను పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. అప్పటి నుంచి అంటే 20 రోజులుగా లాకప్ లోనే ఉంటూ ఊచలు లెక్కపెడుతూ, స్టేషన్ కి వచ్చి పోయే వాళ్ళని చూస్తూండగా పోలీస్ సిబ్బందే సమయానికి నీరు, ఆహారం అందిస్తున్నారు. రాత్రి డ్యూటీ చేస్తే సెంట్రీలకు నిద్ర పడితే తెల్లవారుజామున నాలుగు గంటలకే కూసి నిద్ర లేపుతున్నాయి.
 
ఇవి ఏ జన్మలోనో జైల్ జీవితం తప్పించుకున్నాయో ఈ జన్మలో అనుభవిస్తున్నాయని స్టేషన్‌కు వచ్చిన వాళ్ళు సరదాగా కామెంట్ చేస్తున్నారు. నిబంధన ప్రకారం వీటిని సెల్‌లో ఉంచామని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఉంచుతామని ఏస్ఐ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments