Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1 నుంచి థియేటర్ల మూసివేత!?

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (09:17 IST)
తెలుగు రాష్ట్రాల్లో మార్చి ఒకటో తేదీ నుంచి థియేటర్లు మూతపడనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం త‌ప్ప‌క అమ‌లుప‌ర‌చాల‌ని చెప్పిన ఎగ్జిబిటర్లు ఓటీటీ విడుదల విషయంలో కూడ గట్టి నిబంధన పెట్టారు. థియేట‌ర్స్‌లో విడుద‌లైన 6 వారాల త‌ర్వాత పెద్ద సినిమాలు, 4 వారాల త‌ర్వాత చిన్న సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేయాలన్నారు. అలా చేస్తేనే మంచి థియేట్రిక‌ల్ ర‌న్ ఉంటుంద‌ని వారు. 
 
ఇదే అంశంపై రామానాయుడు స్టూడియోలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మ‌ధ్య సమావేశం జరిగింది. ఇందులో ఈ మీటింగ్‌లో ప‌లు డిమాండ్స్ వారి ముందుంచారు. వీటిని ఒప్పుకోని ప‌క్షంలో మార్చి 1 నుండి థియేట‌ర్స్ మూత‌బ‌డ‌తాయి అని స్ప‌ష్టం చేశారు. 
 
సమావేశంలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, ఆసియన్ సునీల్, మైత్రీ మూవీస్ నిర్మాతలు, బివిఎస్ఎన్ ప్రసాద్ హాజరు కాగా, వీరు ఎగ్జిబిట‌ర్స్ కండీష‌న్స్‌కు క‌ట్టుబ‌డి ఉంటే సినిమాలు య‌ధావిదిగా థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శితం అవుతాయి. లేదంటే సినీ ప్రియుల‌కు మ‌రోసారి నిరాశ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ ‘నిన్నిలా నిన్నిలా’ ట్రైల‌ర్ విడుద‌ల‌