తెలంగాణాలో ఆలస్యంకానున్న ఇంటర్ పరీక్షా ఫలితాలు

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (13:22 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో జాప్యం కానుంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే ఈ ఫలితాలను వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంటర్ బోర్డు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక జూన్ 15వ తేదీన ఈ ఫలితాలను వెల్లడించనున్నారనే వార్తలు వచ్చాయి. 
 
కానీ, ఆ రోజు కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్ ఫలితాలు ఎపుడు వెల్లడవుతాయన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ నెలాఖరైనా ఈ ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, తెలంగాణ విద్యా శాఖ అధికారుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments