Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:23 IST)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఓకే చెప్పింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థిస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్‌ను కొట్టివేసింది.
 
గతంలో ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ  ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిట్ విచారిస్తుంది. అయితే, సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో జరుగుతుందని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణ పారదర్శకంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు కోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీబీఐ విచారణకు ఆదేశించవద్దంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments