Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుటాకులా వణికిన టర్కీ - రెండు వరుస భూకంపాలు - 100 మందికిపైగా మృతి

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (11:00 IST)
దక్షిణ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు వచ్చాయి. దీంతో దక్షిణ టర్కీ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భూకంప తీవ్ర ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భవనాల శిథిలాల చిక్కుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ భూకంపం వల్ల దాదాపు వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
భూకంప లేఖినిపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదాకర పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా ఉన్నాయి. 
 
ఈ భూకంప ప్రభావం సిరియా, యెమెన్ తదితర సరిహద్దు దేశాల్లో కూడా కనిపించాయి. ఉత్తర సిరియాలోని పలు భవనాలు కూలినట్టు సమాచారం. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో తొలుత భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని సెకన్లకే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు తెలిపింది. 
 
గజియాంటెప్ ప్రావిన్స్‌‍లోని నుదర్గికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూమికి 17.9 కిలోమీటర్ల లోతున తొలి భూకంపం సంభవించినట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే సెంట్రల్ టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతున రెండో భూకంపం సంభవించినట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments