Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.కోటి బదిలీచేసిన పవన్ - టీఎస్ గవర్నర్ ప్రశంసలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:07 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల చెన్నై హార్బరులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను ఆదుకునే విషయంలో పవన్ ప్రత్యేక చొరవ చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లి జాలర్లను ప్రాణాలతో పవన్ కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్... పవన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
 
ఇపుడు మరోమారు పవన్‌ను ప్రశంసించారు. దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కేర్స్ ఫండ్‌ను నెలకొల్పారు. దీనికి పవన్ తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను ఆయన నెఫ్ట్ ద్వారా బదిలీ చేశారు. దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ షేర్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై... పవన్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ చర్యలు లక్షలాది మంది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తాయని, దూరదృష్టిగల మన పీఎం ద్వారా దేశానికి సాయపడుతున్న పవన్ పెద్ద మనసుకు సెల్యూట్ అంటూ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments