Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (14:50 IST)
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా వుందనే అంశంపై చేసిన సర్వేలో.. టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయిందని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 103 నుంచి 106 సీట్లను కైవసం చేసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
 
2004లో తాము పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంబించిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments