Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి షాక్.. ఈటెలతో పాటు ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:09 IST)
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీజేపీకి షాక్ తప్పలేదు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్‌ సహా రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 
 
గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగిన నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
దీనికి సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సమావేశాలు ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
 
బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావు అసెంబ్లీ లోపల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఎంత చెప్పినా ఆందోళన ఆపకపోవడంతో మార్షల్స్ సహాయంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను వాహనాల్లో అసెంబ్లీ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
అంతకు ముందు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. నిర్బంధపాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. 
 
సీఎం కేసీఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments