Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:42 IST)
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు.
 
మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 
 
నిజానికి ఆదివార‌మే యూపీ ఐదో ద‌శ ఎన్నిక‌ల‌తో పాటు మ‌ణిపూర్‌లో తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే పోలింగ్ ఏర్పాట్ల‌లో జ‌రిగిన అంత‌రాయం కార‌ణంగా ఈ ఎన్నికలు ఈరోజుకి వాయిదా పడింది. 
 
మ‌ణిపూర్‌లో రెండో విడత పోలింగ్ మార్చి 5వ తేదీన జరగనుంది. రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఇక‌పోతే మార్చి 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతారు.. సీబీఐకీ ఇస్తే 11కేసులకుతోడు 12 కేసులు అవుతాయి..