Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - రైతుల ఆందోళన

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (09:05 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, పిడుగులు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అదేసమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే 5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. దీనికితోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండంతో ప్రజలు వణికిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments