Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వై నాట్ 175' గొంతులు మూగబోయాయి : పయ్యావుల కేశవ్

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (08:53 IST)
ఏపీలో తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వై నాట్ 175 అనే గొంతులు మూగబోయాయని ఏపీ రాష్ట్ర ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దీనిపై పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, పులివెందుల నుంచి తెదేపా ఎమ్మెల్సీ గెలిచారని త్వరలో ఎమ్మెల్యే కూడా తెదేపా నుంచే గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 
 
వైకాపా నిఘంటువులోనే లేని ప్రజలు, ప్రజాసామ్యం అనే పదాలను సకల శాఖామంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పలుకుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన ఒక్క షాకుతో ఆయనకు అధికారంలో ఉన్నామా? అనే అనుమానం రావడం శుభ పరిణామమేనని వ్యాఖ్యానించారు. మాస్కు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్టు చేయడం వరకు చట్టాన్ని బుల్డోజ్‌ చేశారని పయ్యావుల వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారని మండిపడ్డారు. 'ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండగా మా సంఖ్యా బలం 23. మా ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరు?' అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెదేపా బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments