కుమారుల వంతులవారీ పోషణ భరించలేక చితిని పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:23 IST)
తనను కన్నబిడ్డలు వంతుల వారీగా పోషించడాన్ని జీర్ణించుకోలేని ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ముందు ఆయన తన చితిని తానే పేర్చుకుని చితికి నిప్పంటించుకుని, ఆ మంటల్లో దూకి ప్రాణాలు తీసున్నారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90) అనే వ్యక్తికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈయన భార్య గతంలోనే చనిపోయింది. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుమారులకు తనకున్న నాలుగు ఎకరాల భూమిని సమానంగా పంచిపెట్టారు. ఆ తర్వాత తనకు వచ్చే వృద్ధాప్య పింఛనుతో పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉంటూ వచ్చాడు. అయితే, తండ్రి పోషణ తనదొక్కడిదే కాదని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడు. 
 
నెలకు ఒకరు చొప్పున పోషించాలని పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు కనకయ్య వద్ద నెల రోజులు గడిచిపోవడంతో నవాబుపేటలో ఉన్న రెండో కుమారుడు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. ఆయనతో ఆ రాత్రి తన బాధలు చెప్పుకుని విలపించారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత నవాబ్ పేటలోని కుమారుడు వద్దకు వెళుతున్నట్టు చెప్పి అక్కడ నుంచి బయలుదేరాడు. 
 
అయితే, సాయంత్రమైన తన తండ్రి ఇంటికి చేరుకోలేదు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం గ్రామంలోని ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఉన్న వెంకటయ్య మృతదేహం కనిపించింది. తాటికమ్మలను ఒక్కచోట కుప్పగా వేసి దానికి నిప్పంటించి ఆ మంటల్లో దూకి వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments