Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఇంటి ముందే భార్య మృతదేహం పూడ్చివేత

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలో భర్త, అత్తమామల వేధింపులు కారణంగా నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆ గర్భిణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు బంధువులకు అప్పగించారు. అయితే, వారు మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టకుండా, భర్త ఇటి ముందే పూడ్చి పెట్టారు. దీనికి సంబంధించి 50 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అన్నవాసల్ సమీపంలోని విలాసపట్టిలో గత నెల 29వ తేదీన కుటుంబ సమస్యతో నాగేశ్వరి అనే 8 నెలల గర్భిణి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుదుక్కోట  ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 
ఈ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, మామ తంగమణి, అత్త విజయలను పోలీసులు అరెస్టు చేసి జైలుకుపంపించారు. ఈ ముగ్గురు జైలులో ఉండగా, నాగేశ్వరి మృతదేహాన్ని విలాపట్టిలోని భర్త ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టారు. ఈ విషయాన్ని విజయ సోదరుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో అన్నవాసల్ పోలీసులు మృతదేహాన్ని ఇంటి గేటు వద్ద పూడ్చిపెట్టినందుకు 50 మందిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments